Rythu Bandhu Scheme: రైతులకు బంపర్ ఆఫర్: రూ.2 లక్షల వడ్డీ లేని రుణం, వెంటనే దరఖాస్తు చేసుకోండి!

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

రైతులకు బంపర్ ఆఫర్: రూ.2 లక్షల వడ్డీ లేని రుణం, వెంటనే దరఖాస్తు చేసుకోండి! | Rythu Bandhu Scheme 2025 |AP farmers Rythu Bandhu Scheme 2025 | Rythu Bandhu Scheme 2 Lakhs Loan For AP Farmers

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం మరో మంచి పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. అదే రైతు బంధు పథకం. ఈ పథకం కింద రైతులు తమ పంటను మార్కెట్ యార్డు గోదాములలో నిల్వ చేసుకొని, దానిపై వడ్డీ లేని రుణం పొందవచ్చు. దీనివల్ల రైతులకు తమ పంటకు మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం లభిస్తుంది.

Rythu Bandhu Scheme 2 Lakhs Loan For AP Farmers
వడ్డీ లేని రుణం ఎలా పొందాలి?

రైతు బంధు పథకం కింద, రైతులు తమ పంట దిగుబడి రాగానే, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న గోదాములలో ఆరు నెలల పాటు ఉచితంగా నిల్వ చేసుకోవచ్చు. ఈ సమయంలో, నిల్వ చేసిన పంట మార్కెట్ విలువలో 75 శాతం వరకు వడ్డీ లేని రుణాన్ని పొందవచ్చు. ఈ రుణానికి 180 రోజుల వరకు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ 181 నుంచి 270 రోజుల వరకు అయితే 12 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.50 వేలతో ప్రారంభమైన ఈ రుణం, ఇప్పుడు రూ.2 లక్షల వరకు పొందే అవకాశం ఉంది.

Rythu Bandhu Scheme 2 Lakhs Loan For AP Farmers పల్నాడు జిల్లాలో పథకం అమలు

ప్రస్తుతం పల్నాడు జిల్లాలోని 12 మార్కెట్ యార్డులలో ఈ రైతు బంధు పథకం అమలు చేస్తున్నారు. వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇప్పటికే రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ మార్కెట్ యార్డుకు రూ.2 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు 40 మంది రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకుని, రూ.77.22 లక్షల రుణం పొందారు.

SBI RTXC Personal Loan Online Telugu Guide
ఎస్‌బీఐ నుంచి భారీ శుభవార్త.. మీరు బ్యాంకు కు వెళ్లకుండానే రూ.5 నుంచి రూ.౧౫ లక్షల లోన్ పొందొచ్చు! | SBI RTXC Personal Loan Online

Rythu Bandhu Scheme 2 Lakhs Loan For AP Farmers నిధులు కేటాయించిన మార్కెట్ యార్డులు

  • చిలకలూరిపేట, సత్తెనపల్లి మార్కెట్ యార్డులకు రూ.1 కోటి చొప్పున.
  • క్రోసూరుకు రూ.60 లక్షలు.
  • గురజాల, రొంపిచర్లకు రూ.50 లక్షల చొప్పున.
  • ఈపూరుకు రూ.20 లక్షలు, దుర్గికి రూ.30 లక్షలు.

మరికొన్ని మార్కెట్ యార్డులకు కూడా నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఈ పథకం కింద నిల్వ చేసిన ధాన్యానికి బీమా సౌకర్యం కూడా ఉంది.

Rythu Bandhu Scheme 2 Lakhs Loan For AP Farmers రైతులు ఏం చేయాలి?

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం, రైతులు తమ దగ్గరలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులను సంప్రదించి, తమ పంట దిగుబడి రాగానే ఈ రైతు బంధు పథకం కింద లబ్ధి పొందవచ్చు. ఈ మంచి అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

👉 Source / Referance – AP Rythu BandhU SCheme 2025

Union Bank RSETI Free Training Courses
Free Training Courses: గ్రామీణ మహిళలకు గోల్డెన్‌ ఛాన్స్.. ఫ్రీ గా ఈ స్కిల్స్ నేర్చుకుని ఇంట్లోనే సంపాదించవచ్చు.

👉 ఒక్కో రైతుకు రూ. 2 వేలు.. వీరికి మాత్రం పీఎం కిసాన్ డబ్బులు రావు.. ఏం చేయాలంటే?

👉 ఏపీలో 50 ఏళ్లకే పింఛన్లు! నెలకు రూ.4 వేలు, అర్హత వివరాలు వెల్లడి!

Indira Dairy Scheme 70 Percent Subsidy Details Telugu
70% సబ్సిడీతో ఇందిరా డెయిరీ పథకం: మహిళలకు నెలకు ₹40,000 ఆదాయం!
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp